జోక్యం చేసుకోవాలి: బ్రిటన్ ఎంపీలు

by  |
జోక్యం చేసుకోవాలి: బ్రిటన్ ఎంపీలు
X

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనల్లో జోక్యం చేసుకోవాలని యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్‌ను 36 మంది బ్రిటన్ ఎంపీలు కోరారు. భారత విదేంశాగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సంభాషించి రైతుల డిమాండ్లను పరిష్కరించడానికి సూచనలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇండియాలో రైతుల ఆందోళనలతో బ్రిటీష్ పంజాబీలపై పడుతున్న ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్‌తో చర్చించాలని బ్రిటీష్ సిక్కు, లేబర్ ఎంపీ తన్మజీత్ సింగ్‌తోపాటు ఎంపీలు వీరేంద్ర శర్మ, సీమా మల్హోత్రా, వెలరీ వాజ్‌లు అభ్యర్థించారు.


Next Story

Most Viewed