ఘోర రైలు ప్రమాదం.. 32 మంది మృతి

by  |
ఘోర రైలు ప్రమాదం.. 32 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు పాసింజర్‌ రైళ్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో 32 మంది మృతి చెందారు. ఈ ఘటన దక్షిణ కైరో ప్రాంతంలోని షోహాగ్‌లో జరిగింది. ఈ ప్రమాదంలో 66 మందికి గాయాలైనట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి.. వైద్య సాయం అందిస్తున్నట్టు అధికారులు చెప్పారు.

రెండు రైళ్లు ఢీకొట్టడంతో నాలుగు బోగీలు బోల్తా పడ్డాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు వైద్య అధికారులు చెప్పారు.

Next Story