పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. రూ. 3100 బోనస్

by  |
charan
X

దిశ, వెబ్‌డెస్క్: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అతలకూతలమైన భవన నిర్మాణ కార్మికులకు అదుకోనుంది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. భవనం, నిర్మాణ పనుల సంక్షేమ బోర్డులో నమోదు చేసుకున్న నిర్మాణ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.3100 చొప్పున ఆర్థిక ఉపశమనాన్ని ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో అపారమైన నష్టాలను చవిచూసిన కార్మికులకు ఈ ప్రోత్సాహకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని పంజాబ్ నూతన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో భవన నిర్మాణ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed