కర్నూలులో 300 చేరువలో పాజిటివ్ కేసులు

by Vemula.Srinu Prasad |

<p>ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే నమోదు కావడంతో తీవ్రత ఏవిధంగా ఉందో అద్దం పడుతోంది. జిల్లాలో కేసుల సంఖ్య 300కు చేరువైంది. ఈనెల 2‌వ తేదీ వరకు కేవలం 4 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య 292కు చేరింది. ఇప్పటివరకు జిల్లాలో 10 మంది మృతి చెందగా, మరో 31 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నేడు మరో 11 మంది [&hellip;]</p>

కర్నూలులో 300 చేరువలో పాజిటివ్ కేసులు
X

ఏపీలోని కర్నూలు జిల్లాలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక కేసులు ఈ జిల్లాలోనే నమోదు కావడంతో తీవ్రత ఏవిధంగా ఉందో అద్దం పడుతోంది. జిల్లాలో కేసుల సంఖ్య 300కు చేరువైంది. ఈనెల 2‌వ తేదీ వరకు కేవలం 4 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య 292కు చేరింది. ఇప్పటివరకు జిల్లాలో 10 మంది మృతి చెందగా, మరో 31 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. నేడు మరో 11 మంది డిశ్చార్జి కానున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 22న అత్యధికంగా ఒకేసారి 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా అత్యధిక కేసులు కర్నూలు సిటీ, ఆత్మకూరు, నంద్యాల, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు పట్టణాల్లో నమోదవుతున్నాయి.

Tags: corona, kurnool, ap, near 300 positive cases

Next Story