దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సిన్ సరాఫరా

by  |
దేశవ్యాప్తంగా ప్రారంభమైన వ్యాక్సిన్ సరాఫరా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ సరాఫరా ప్రారంభమైంది. కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్‌ను రూపొందించిన సీరం ఇన్‌స్టిట్యూట్ తొలి విడత టీకా సరాఫరా ప్రారంభించింది. పుణెలోని తయారీ కేంద్రం నుంచి టీకా డోసులను మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా బట్వాడా చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య వీటిని పుణె విమానాశ్రయానికి తరించారు.పుణె నుంచి ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గౌహతి, లక్నో, చండీగఢ్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. సిరం నుంచి 1.1 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను తరలిస్తున్నారు.

కాసేపట్లో కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్‌కు చేరుకోనుంది. తెలంగాణలో 1,213 సెంటర్లలో వ్యాక్సినేషన్ పంపిణీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్ అందజేయనున్నారు.

Next Story

Most Viewed