ఐఈడీ దాడులు.. ముగ్గురు జవాన్లు మృతి

by  |
ఐఈడీ దాడులు.. ముగ్గురు జవాన్లు మృతి
X

దిశ, వెబ్ డెస్క్ :
మణిపూర్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు అసోం రైఫిల్స్‌ సిబ్బందిపై ఐఈడీ దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆ జవాన్లు తేరుకోకముందే వారిపై కాల్పులకు తెలబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యారు. ఇది మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌కు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలోని చందేల్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జవాన్ల మరణం పై పలువురు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటన పై మరింత సమాచారం రావాల్సి ఉంది.

Next Story