నేల‌కొండ‌ప‌ల్లిలో ముగ్గురికి పాజిటివ్..

by  |
నేల‌కొండ‌ప‌ల్లిలో ముగ్గురికి పాజిటివ్..
X

దిశ‌, పాలేరు :
ఖ‌మ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ‌నివారం కరోనా టెస్టులు ప్రారంభించారు. ఆరోగ్య శాఖ పంపించిన యాంటిజెన్ ర్యాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా ప‌రీక్ష‌లు జరిపారు. అయితే, ఈ ప‌రీక్ష‌ల్లో ఇప్ప‌టివ‌ర‌కు ముగ్గురికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. వారిలో ఇద్ద‌రు దంప‌తులు ఉన్నారు. పాజిటివ్ వచ్చిన దంపతులిద్దరూ ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న‌ట్లుగా వైద్యులు గుర్తించారు. అనంతరం వారిని హోం క్వారంటైన్లో ఉండాల‌ని సూచించారు. వీరితో పాటు మండల కేంద్రంలోని ఓ హోటల్ యజమానికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఇటీవ‌ల ఆ హోట‌ల్‌కు వెళ్లిన ప్రజలందరూ ఆందోళ‌న వ్యక్తంచేస్తున్నారు.

Next Story

Most Viewed