- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నర్సంపేట : నర్సంపేట నుంచి ఖానాపురం వెళ్లే మార్గంలోని జాతీయ రహదారి 365 రక్తమోడుతోంది. శుక్రవారం అర్ధరాత్రి తన తండ్రి కేసు నిమిత్తం ఇంటికి వెళ్తున్న సురేష్ చెట్టుకు ఢీ కొని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇది గడిచి 24 గంటలు గడవక ముందే సరిగ్గా అదే స్థలంలో మరో ప్రమాదం సంభవించింది. స్థానిక ఎంజీఆర్ మిల్లు దగ్గరలో ముగ్గురు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు నర్సంపేట మండలంలోని బానోజీపేట గ్రామానికి చెందిన వెలిషోజు వినీత్, మంగళవారిపేట గ్రామానికి చెందిన మల్లేష్గా గుర్తించారు. బాధితులను మెరుగైన వైద్యం కోసం వరంగల్కి తరలించినట్లుగా సమాచారం. సంఘటన స్థలానికి పోలీస్ సిబ్బంది చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడించనున్నారు.