బైక్ జర్నీలో విషాదం.. స్పాట్‌లో ముగ్గురు మైనర్‌లు మృతి

by  |
బైక్ జర్నీలో విషాదం.. స్పాట్‌లో ముగ్గురు మైనర్‌లు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మైనర్‌ బాలికలతో పాటు ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన ముంబై-ఆగ్రా జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాశిక్ జిల్లా ఇగత్‌పురి తాలూకాకు చెందిన తుషార్ హరి (25) తన ద్విచక్ర వాహనంపై పాయల్ గతిర్(11), విశాఖ గతిర్ (7), ఈశ్వరి దాఖర్ (10)లను ఎక్కించుకుని ముంబై-ఆగ్రా హైవే మీదుగా ఇంటికి బయల్దేరాడు. సరిగ్గా ముండేగావ్ అనే గ్రామం వద్దకు రాగానే వెనకాలే వచ్చిన ఓ ట్రక్కు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్‌ బాలికలతో పాటు తుషార్ హరి అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా తలకు బలమైన గాయాలు కావడంతో స్పాట్‌లోనే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.


Next Story

Most Viewed