13 మంది కార్మికులకు అస్వస్థత

by  |

దిశ, మెదక్: రసాయనాల ప్రభావంతో 13 మంది కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట శివారులో ఉన్న ఓ పరిశ్రమలో నాలుగు రోజుల క్రితం రసాయన డబ్బాల మూతలు విప్పి చూస్తుండగా.. ఒక్కసారిగా రసాయనాల ఘాటు తగలడంతో కార్మికులకు కళ్లమంటలు వచ్చాయి. క్రమక్రమంగా కళ్ల మంటలు ఎక్కువ కావడంతో పరిశ్రమ నిర్వాహకులు కార్మికులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కార్మికులు ఉద్యోగాల్లో చేరేవరకు యాజమాన్యం జీతాలు అందించాలని సర్పంచ్ శ్రీలత కోరారు.

Next Story

Most Viewed