ఒకే కుటుంబంలో ముగ్గురు అదృశ్యం

by  |
ఒకే కుటుంబంలో ముగ్గురు అదృశ్యం
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌ మహానగంలోని మియాపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా కలకలం రేపుతోంది. మియాపూర్‌లోని హఫిజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌లో నివాసముంటున్న దీపిక (34), ఆమె కూతురు సాయిలిపి (14), కుమారుడు చైతన్య(9)తో కలిసి శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. చీకటి పడినా వారు తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు రెండ్రోజులుగా బంధువులు, తెలిసిన వారి ఇళ్లల్లో ఆరా తీస్తున్నారు.

అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సోమవారం మియాపూర్‌ పోలీస్‌‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉండే సీసీ కెమెరాల సాయంతో కనిపించకుండా పోయిన వారికోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

Next Story

Most Viewed