- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శుభకార్యానికి వెళ్లొస్తూ..అనంతలోకాలకు
<p>దిశ, ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి అంతరాష్ట్ర రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్సెట్టిపేట వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం..కాసిపేట మండలం పెర్కపల్లిలో ఓ శుభకార్యానికి హాజరైన ముగ్గురు వ్యక్తులు తెల్లవారు జామున లక్సెట్టిపేటకు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. అదే సమయంలో గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పొయారు. […]</p>

X
దిశ, ఆదిలాబాద్ :
మంచిర్యాల జిల్లాలోని మందమర్రి అంతరాష్ట్ర రహదారిపై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్సెట్టిపేట వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం..కాసిపేట మండలం పెర్కపల్లిలో ఓ శుభకార్యానికి హాజరైన ముగ్గురు వ్యక్తులు తెల్లవారు జామున లక్సెట్టిపేటకు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు. అదే సమయంలో గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పొయారు. మృతులు కొమురయ్య (48), సుజాత(40), కావ్య(18)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
Next Story






