ఏపీలో 3లక్షల 93వేలు దాటిన కేసులు

by  |
ఏపీలో 3లక్షల 93వేలు దాటిన కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ ఏమాత్రం ఆగడం లేదు. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 61వేల 300 మందికి పరీక్షలు నిర్వహించగా 10,621 పాజిటివ్‌లు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరింది. ఇవాళ 92మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 3,633గా ఉంది. తాజాగా 8,528మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 94,209 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 2లక్షల 95వేల 248మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34లక్షల 79వేల 990మంది శాంపిల్స్ పరీక్షించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహహ్మారి బారిన పడి కర్నూలు జిల్లాలో 13మంది మరణించగా, నెల్లూరు జిల్లాలో 11మంది, తూర్పుగోదావరిలో 10మంది, చిత్తూరులో 9మంది, కడపలో ఏడుగురు, పశ్చిమగోదావరిలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు చనిపోయారు. అటు అనంతపురం జిల్లాలో 815 కేసులు నమోదు కాగా, చిత్తూరులో 928, తూర్పుగోదావరిలో 1089, గుంటూరులో 926, కడపలో 844, కృష్ణాలో 316, కర్నూలులో 855, నెల్లూరులో 934, ప్రకాశంలో 1020, శ్రీకాకుళం 846, విశాఖపట్నంలో 593, విజయనగరం 563, పశ్చిమగోదావరి జిల్లాలో 892 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.



Next Story