మహిళలను పరిగెత్తించిన దొంగలు.. సినీ ఫక్కీలో రూ.2లక్షలు చోరీ

by  |
మహిళలను పరిగెత్తించిన దొంగలు.. సినీ ఫక్కీలో రూ.2లక్షలు చోరీ
X

దిశ, స్టేషన్ ఘన్‌పూర్ : బ్యాంకులో డబ్బులు డ్రా చేసి చేతి సంచిలో పెట్టుకుని ఇంటికి వెళ్తున్న మహిళల నుండి ద్విచక్ర వాహనం పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు రూ.2 లక్షలు గల సంచిని లాక్కుని వెళ్ళిపోయారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో వెలుగుచూసింది. బాధితులు స్టేషన్ ఘన్‌పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పులిగిల్ల స్వప్న, పులిగిల్ల రాధా, ముక్కెర సమ్మక్కగా గుర్తించారు. వీరంతా మహిళా పొదుపు సంఘం నుండి రుణం తీసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చారు.

శ్రీనిధి పొదుపు సంఘం ద్వారా రెండు లక్షల రుణం తీసుకుని ప్లాస్టిక్ బ్యాగులో పెట్టుకొని ఇంటికి వెళ్లేందుకు బ్యాంకు నుండి బస్టాండ్‌కు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎస్బీఐ నుండి 100 మీటర్లు వెళ్లేసరికి ఎదురుగా ఒక స్కూటీ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మహిళల చేతిలో ఉన్న డబ్బు సంచిని సినీ ఫక్కీలో లాక్కొని వెళ్లిపోయారు. ఘటనతో ఆలస్యంగా తేరుకున్న మహిళలు అరుపులు, కేకలు వేస్తూ ఉన్నప్పటికీ దొంగలు స్కూటీపై హనుమకొండ వైపు వెళ్లిపోయారు. వెంటనే రంగప్రవేశం చేసిన బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు రమేష్ నాయక్, శ్రీనివాసులు రంగప్రవేశం చేసి దొంగలను పట్టుకునేందుకు అటు బ్యాంకులో, ఇటు రోడ్డు వెంట ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

Next Story