ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయ్

by  |
ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో రోజురోజుకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 2,886 కేసులు నమోదు అయ్యాయి. మరో 17 మంది కొవిడ్-19 బారిన పడి మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,20,565మందికి కరోనా సోకింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతుల సంఖ్య 6,676 మందికి చేరింది. గడిచిన 24 గంటల్లో 3,243 మంది బాధితులు పూర్తిగా కోలుకోగా.. రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 7,88,375కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 25,514 యాక్టివ్‌ కేసులున్నాయి.



Next Story

Most Viewed