ఏపీ ప్రజలకు ఊరట.. తగ్గుముఖం పడుతోన్న కరోనా

by  |
AP corona Update
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు చాల వరకు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 91,677 సాంపిల్స్‌ను పరీక్షించగా 2,665 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,22,843 కు పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 16 మంది మృతి చెందగా..మెుత్తం మరణాల సంఖ్య 13,002కి పెరిగాయి. ఇకపోతే గడచిన 24 గంటల్లో 3,231 మంది కరోనా నుంచి కోలుకోగా..మెుత్తం రికవరీ అయిన వారి సంఖ్య 18,81,16కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,680 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Next Story