గడ్చిరోలి ఎన్‌కౌంటర్.. 26కు పెరిగిన మావోయిస్టుల మృతుల సంఖ్య

by  |
Maoists
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అంతేగాకుండా.. ఈ ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు కూడా తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం.

కాగా, మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే మరణం తర్వాత మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ మధ్య తెలంగాణలోని ములుగులో పోలీసుల ఎన్ కౌంటర్‌లో ముగ్గురు కీలక నేతలు చనిపోగా, ఉత్తరాదిలో పలువురు సీనియర్ నేతలను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లోనూ పార్టీకి తీవ్రనష్టం వాటిల్లింది.


Next Story

Most Viewed