ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం.. 250 ప్యాసింజర్స్?

by  |
ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం.. 250 ప్యాసింజర్స్?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండోనేషియా గగనతలంలో కనిపించకుండా పోయిన విమానం కుప్పకూలినట్లు ఏవీయేషన్ అధికారులు గుర్తించారు. రాజధాని జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం నుంచి కమ్యూనికేషన్ తెగిపోయిన విషయం తెలిసిందే. రాడార్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సిగ్నల్స్ అందకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు.

ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి పొటియానక్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకోగా.. ప్రమాదం సమయంలో విమానంలో 250 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రయాణికులకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దృష్టి సారించారు.



Next Story