ఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు

by  |
ఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తోంది. గతకొన్ని రోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. ఏపీలో కొత్తగా 2,477 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,33,208కు చేరింది. వైరస్ బారినపడి తాజాగా మరో 10 మంది మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 6744కు పెరిగింది. కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 21,438గా ఉన్నాయి. అంతేగాకుండా కరోనా నుంచి కోలుకుని 8,05,026 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకూ 83,42,265 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

Next Story