కాలక్షేపానికి ప్యాక ఆడితే..24 మందికి కరోనా

by Vemula.Srinu Prasad |

<p>విజయవాడలో ఓ ట్రక్ డ్రైవర్ 24 మందికి కరోనా అంటించాడు. కృష్ణ లంకు చెందిన అతను ఇతర రాష్ట్రాలకు వెళ్లగా అతనికి కరోనా సోకింది. విషయం తెలియని అతను బోర్ కొడుతోందని స్థానికులతో కలిసి ప్యాక ఆడగా ఈ పరిస్థితి తెలెత్తినట్టు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విజయవాడలో కేవలం ఇద్దరి వ్యక్తుల వల్ల 39 కరోనా కేసులు వ్యాపించినట్టు చెప్పారు. ఇప్పటికే విజయవాడలో 100కు పైగా కరోనా కేసులు నమోదైనట్టు వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని [&hellip;]</p>

కాలక్షేపానికి ప్యాక ఆడితే..24 మందికి కరోనా
X

విజయవాడలో ఓ ట్రక్ డ్రైవర్ 24 మందికి కరోనా అంటించాడు. కృష్ణ లంకు చెందిన అతను ఇతర రాష్ట్రాలకు వెళ్లగా అతనికి కరోనా సోకింది. విషయం తెలియని అతను బోర్ కొడుతోందని స్థానికులతో కలిసి ప్యాక ఆడగా ఈ పరిస్థితి తెలెత్తినట్టు కృష్ణా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. విజయవాడలో కేవలం ఇద్దరి వ్యక్తుల వల్ల 39 కరోనా కేసులు వ్యాపించినట్టు చెప్పారు. ఇప్పటికే విజయవాడలో 100కు పైగా కరోనా కేసులు నమోదైనట్టు వివరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

Tags: coronavirus,Truck Driver,24 positive cases,vijayawada

Next Story