దుబ్బాక బైపోల్: బరిలో వీళ్లే !

by  |
దుబ్బాక బైపోల్: బరిలో వీళ్లే !
X

దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక నియోజకవర్గ ఉపఎన్నికలో సోమవారం సాయంత్రానికి నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసింది. ఇక్కడ మొత్తం 46నామినేషన్లు దాఖలు కాగా, 11 మంది ఉపసంహరించుకున్నారు. స్క్రూటినీలో మరో 12నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో మొత్తంగా 23మంది దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచారు. వీరిలో 8మంది పార్టీ గుర్తులతో పోటీ చేస్తుండగా 15మంది స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నారు.

పార్టీ గుర్తులతో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, అల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్ అభ్యర్థి కత్తి కార్తీక, జై స్వరాజ్ అభ్యర్థి గౌట్ మల్లేశం, శ్రమజీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్, ఇండియా ప్రజా బంద్ పార్టీ అభ్యర్థి సునీల్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి సుకురి అశోక్ పోటీ చేస్తున్నారు.

స్వతంత్ర అభ్యర్ధులు:

అండర్ఫ్ సుదర్శన్, అన్న బుర్ర రవితేజ గౌడ్, అన్న రాజ్, కంటే సాయన్న, కొట్టాల యాదగిరి ముదిరాజ్, కోట శ్యామ్‌కుమార్‌, విక్రమ్‌రెడ్డి వేముల, బండారు నాగరాజ్, పీఎం.బాబు, బుట్టన్నగారి మాధవ రెడ్డి, మోతె నరేష్, రణవేని లక్ష్మణ్‌ రావు, రేపల్లె శ్రీనివాస్, వడ్ల మాధవాచారి, సిల్వెరి శ్రీకాంత్.



Next Story

Most Viewed