కరోనా వదంతులతో 23 మంది ఖైదీలు మృతి

by  |
కరోనా వదంతులతో 23 మంది ఖైదీలు మృతి
X

క‌రోనా వైర‌స్ సోకింద‌న్న పకార్లు రావ‌డంతో.. కొలంబియాలోని ఓ జైలులో అల్ల‌ర్లు చోటుచేసుకున్నాయి. ఈ హింసాత్మక అల్లర్లలో ఆ జైలులోని 23 మంది ఖైదీలు చ‌నిపోయారు.
కొలంబియా రాజ‌ధాని బొగొటాలో కిక్కిరిసిపోయిన ఓ జైలులో ఈ ఘ‌ట‌న జరిగింది. ఈ సంఘ‌ట‌న‌తో ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. బ‌య‌ట‌కు పారిపోవాల‌నుకున్న ఖైదీలు.. హింస‌కు దిగిన‌ట్లు అక్కడి మంత్రి తెలిపారు. అనంతరం రాత్రి ప‌ది నుంచి తెల్ల‌వారుజామున 5 గంట‌ల వ‌ర‌కు ఎవ‌రూ బ‌య‌ట‌కు రావొద్దు అని ఆదేశాలు జారీ చేశారు.

Tags: 23 inmates killed, following, corona rumorss, Colombia

Next Story

Most Viewed