SP సింధు శర్మ కీలక ఉత్తర్వులు.. 22 మంది ఎస్సైల బదిలీ

by  |
SP సింధు శర్మ కీలక ఉత్తర్వులు.. 22 మంది ఎస్సైల బదిలీ
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఎస్పీ సింధూ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం మొత్తంగా 22 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఇందులో 12 మంది కొత్త వారికి జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలలో పొస్టింగులు ఇచ్చారు. జగిత్యాల రూరల్ ఎస్సై మంద చిరంజీవి, జీవన్ ఎస్సైలను సీసీఎస్‌కు బదిలీ చేశారు.

కొడిమ్యాల ఎస్సైగా శివాని రెడ్డి, పెగడపల్లికి కొక్కుల శ్వేత, బీర్‌పూర్‌కు నినిషా రెడ్డి, మేకల రాజ్యలక్ష్మికి కోరుట్ల-2, శ్రీధర్ రెడ్డి గొల్లపల్లి, ఆరేపల్లి రజితకు కథలాపూర్, బండి లావణ్యకు సారంగాపూర్, వెంకటేశ్‌కు బుగ్గారం, రవికుమార్‌కు జగిత్యాల టౌన్, రాజేందర్‌కు మల్లాపూర్, సురేశ్‌కు ఇబ్రహీంపట్నం -2, మధులికకు మెట్‌పల్లి- 2 ఎస్సైలుగా బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. ఉపెంద్రచారి, మనోహర్ రావు, ఆరోగ్యం, అంజయ్య, శంకర్ నాయక్ ఎస్సైలను ఎస్బీకి బదిలీ చేయగా.. శివక్రిష్ణ, పృథ్వీధర్ గౌడ్, శ్రీకాంత్ ఎస్సైలు వెకెన్సీ రిజర్వుకు బదిలీ అయ్యారు.



Next Story

Most Viewed