- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, విశాఖపట్నం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 పూరి గుడిసెలు కాలిబూడిదయ్యాయి. సుమారుగా రూ.20 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. తొలుత కారి రాము అనే వ్యక్తి ఇంట్లో ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు ఎగిసిపడ్డాయి. ఇదే సమయంలో గాలి వీయడంతో సమీపంలోని ఉన్న పూరి గుడిసెలన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సర్వం కోల్పోయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రభుత్వం నుంచి సాయం అందించాలని వేడుకుంటున్నారు.
Next Story