- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : అడవి ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి 21ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారి తప్పి జనావాసంలోకి వచ్చిన అడవి ఏనుగును స్థానికులు గమనించారు. దానిని ఎలాగైనా తిరిగి అటవీ ప్రాంతంలోనికి తరిమేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు ఏనుగు వస్తున్న దారిలో నిల్చుని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు.
స్థానికులు తరుముతూ ఉండటంతో భయంతో వేగంగా పరిగెత్తుతూ వచ్చిన ఏనుగు అందులో ఓ యువకుడిని తొక్కి చంపేసింది. మిగిలిన వారు భయంతో పారిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Next Story