సెల్ఫీ ట్రయల్ ఫెయిల్.. తొక్కి చంపిన ఏనుగు

by  |
సెల్ఫీ ట్రయల్ ఫెయిల్.. తొక్కి చంపిన ఏనుగు
X

దిశ, వెబ్‌డెస్క్ : అడవి ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి 21ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారి తప్పి జనావాసంలోకి వచ్చిన అడవి ఏనుగును స్థానికులు గమనించారు. దానిని ఎలాగైనా తిరిగి అటవీ ప్రాంతంలోనికి తరిమేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ముగ్గురు స్నేహితులు ఏనుగు వస్తున్న దారిలో నిల్చుని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించారు.

స్థానికులు తరుముతూ ఉండటంతో భయంతో వేగంగా పరిగెత్తుతూ వచ్చిన ఏనుగు అందులో ఓ యువకుడిని తొక్కి చంపేసింది. మిగిలిన వారు భయంతో పారిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story