దేశంలో కొత్తగా 21,821 కరోనా కేసులు

by  |
దేశంలో కొత్తగా 21,821 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో గడిచిన 24 గంటల్లో 21,821 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,66,674కు చేరింది. కాగా గత 24 గంటల్లో కరోనా బారిన పడి 299 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,48,738కు చేరింది. దేశంలో ప్రస్తుతం 2,57,656 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి 98,60,280 మంది కోలుకున్నారని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Next Story

Most Viewed