- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ రాజకుమారుడు సినిమాకు 21 ఏళ్లు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రాన్ని సి. అశ్వినీ వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మించారు. ప్రిన్స్ మహేశ్తో బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింతా జతకట్టగా సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ సందర్భంగా మహేష్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 21 ఏళ్లా.. అప్పుడే.. ఎలా? అంటూ రాజకుమారుడు సెట్స్ నుంచి ప్రీతి, రాఘవేంద్ర రావుతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు మహేశ్. తన మొదటి చిత్రాన్ని సూపర్ స్పెషల్గా చేసిన డైరెక్టర్కు థాంక్స్ చెప్పాడు. అనుభవంతో వచ్చిన అభ్యాసం ఎప్పుడూ గుర్తుండి పోతుందన్న మహేశ్.. మీతో, అద్భుతమైన టీంతో కలిసి పని చేసినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
https://twitter.com/urstrulyMahesh/status/1288758593093636096?s=19
రాజకుమారుడు కి 21 వసంతాలు అంటూ రాఘవేంద్ర రావు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. సినిమాతో
ఎన్నో మధుర జ్ఞాపకాలు… మా అశ్వినీదత్ కి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు అని తెలిపాడు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ స్టిల్స్ పోస్ట్ చేశారు.
రాజకుమారుడు కి 21 వసంతాలు…
ఎన్నో మధుర జ్ఞాపకాలు… మా అశ్వినీదత్ కి మరియు చిత్రబృందానికి శుభాకాంక్షలు.మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను…@urstrulyMahesh @realpreityzinta@VyjayanthiFilms #Manisharma#21YearsForRajakumarudu pic.twitter.com/jlQnGZVlIn
— Raghavendra Rao K (@Ragavendraraoba) July 30, 2020