జల్లికట్టులో ఎద్దుపోట్లు..

by  |
జల్లికట్టులో ఎద్దుపోట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని మధురై జిల్లా అవనీయపురంలో జల్లికట్టు పోటీలు జోరుగా సాగుతున్నాయి. యువకులు ఉత్సాహంగా ఆ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈసారి జల్లికట్టు పోటీల్లో 790 ఎద్దులు,450 మంది యువకులు పాల్గొన్నారు. అయితే, పోటీల్లో భాగంగా ఎద్దులను ఆపేందుకు ప్రయత్నించి 20మంది తీవ్రగాయాలపాలయ్యారు. వారందరినీ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.కాగా, జల్లికట్టును వీక్షించేందుకు చాలా మంది ప్రజలు తరలివచ్చారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..

జల్లికట్టు పోటీలను వీక్షించడానికి ఇవాళ ఉదయం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి మధురైకు చేరుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తమిళుల చరిత్ర, తమిళ సంప్రదాయాలు ఎంతో గొప్పవని.. జల్లికట్టు కోసం తమిళులు ఎంతో పోరాటం చేశారని వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండగా, జల్లికట్టు పోటీలను తిలకించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మధురైకు చేరుకున్నారు.



Next Story

Most Viewed