కింగ్ కోహ్లీ సెంచరీ.. టీమిండియా ఘన విజయం

by Disha Web Desk 2 |
కింగ్ కోహ్లీ సెంచరీ.. టీమిండియా ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని 41.3 ఓవర్లలోనే ఛేదించి భారత్‌ విజయ ఢంకా మోగించింది. చివరిలో సెంచరీ బాది కింగ్ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. భాతర బ్యాటర్లలో రోహిత్ (48), గిల్ (53), విరాట్ కోహ్లీ (103), శ్రేయాస్ (19), కేఎల్ రాహుల్ (34) అందరూ అద్భుతంగా రాణించారు. ఇక బౌలింగ్‌లో టీమిండియాకు రవీంద్ర జడేజా అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 38 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, కుల్దీప్-శార్దూల్ తలో వికెట్ రాబట్టారు.

Next Story

Most Viewed