ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే రూ.100 కోట్లు వాళ్లకు పంచుతా

by Disha Web Desk 2 |
ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే రూ.100 కోట్లు వాళ్లకు పంచుతా
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగబోయే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ కోసం ప్రపంచంలోని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఇండియా కప్ కొట్టి దాదాపు 12 ఏళ్లు కావడంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని జట్టుతో పాటు ఫ్యాన్స్‌ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇండియా కప్ కొట్టాలని ఓ యూట్యూబర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ కప్ కొడితే తన సబ్‌స్క్రైబర్లకు రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ప్రకటించారు. అతనెవరో కాదు.. ఆస్ట్రోటాక్ సీఈవో పునీత్ గుప్తా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో భారత్ గెలవాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. 2011లో ఇండియా వరల్డ్ కప్ కొట్టినప్పుడు తాను కాలేజీలో చదువుతున్నానని.. తన జీవితంలోని అత్యంత ఆనంద క్షణాల్లో అదొకటి అని వ్యాఖ్యానించారు. ఈసారి కప్ గెలిస్తే నా కంపెనీ యూజర్లతో ఆనందాన్ని పంచుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు.




Next Story

Most Viewed