- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. దాదాపు 200 మంది కార్యకర్తలు టీఆర్ఎస్కు రాజీనామా చేసి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య, యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు, పీఏసీఎస్ డైరెక్టర్ ఎలెందర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి ఉన్నవాడికన్నా.. కొత్తగా టీఆర్ఎస్లో చేరిన డబ్బులున్న వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఏడేండ్ల నుంచి ఉద్యమకారులను తొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి సోనియమ్మకు గిఫ్ట్ ఇస్తామని బీర్ల ఐలయ్య అన్నారు.