కొండచరియలు పడి 20 మంది మృతి

by  |
కొండచరియలు పడి 20 మంది మృతి
X

గువహతి: అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడి కనీసం 20 మంది మరణించారు. దక్షిణ అసోంలోని బరాక్ లోయ జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. గత రెండు రోజులుగా అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొండచరియలు జారిపడ్డాయి. దీంతో కాచార్ జిల్లాలో ఏడుగురు, హైలాకాండి జిల్లాలో ఏడుగురు, కరీంగంజ్ జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం అందింది.

Next Story

Most Viewed