తన ఫ్రెండ్ కు పిల్లలు పుట్టడంలేదని.. ఇద్దరు సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి..

by  |
Sex-Worker2
X

దిశ, వెబ్ డెస్క్: రోజురోజుకు మనిషి టెక్నాలజీలో దూసుకుపోతున్నాడు. చదువుకోనివారు కూడా టెక్నాలజీని అద్భుతంగా వినియోగిస్తున్నారు. కానీ, కొంతమందిలో మార్పు కనిపించడంలేదు. మూఢ నమ్మకాలను బలంగా నమ్ముతూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఘటనే చోటు చేసుకుంది. తన ఫ్రెండ్ కు పిల్లలు పుట్టేందుకు భూతవైద్యుడు చెప్పాడని ఇద్దరు సెక్స్ వర్కర్లను బలిఇచ్చాడు ఓ దుర్మార్గుడు.

వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్ కు చెందిన మమత, బదౌరియా అనే వీరు భార్యాభర్తలు. వీరికి వివాహం జరిగి 18 ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదు. తమకు పిల్లలు పుట్టడంలేదని ఎక్కడ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలో బదౌరియా మిత్రుడు నీరజ్ వారిని గిర్వార్ యాదవ్ అనే ఓ వ్యక్తి(భూతవైద్యుడిగా చెప్పుకుంటున్న వ్యక్తి) వద్దకు తీసుకెళ్లాడు. పిల్లలు పుట్టాలంటే మనిషిని బలివ్వాలని వారికి చెప్పాడు ఆ మాంత్రికుడు. అతను చెప్పిన విధంగా బలిచ్చేందుకు నీరజ్ ఈ నెల 13న ఓ సెక్స్ వర్కర్ ను తీసుకొచ్చాడు. అయితే, ఆమెను అక్కడే హత్య చేసి బైక్ పై డెడ్ బాడీని అక్కడికి తీసుకెళ్తున్న సమయంలో ఆ మృతదేహం జారి కిందపడిపోయింది. దీంతో భయపడిన నీరజ్ ఆ డెడ్ బాడీని రోడ్డుపక్కన పడేసి పారిపోయాడు. మళ్లీ అక్టోబర్ 20న మరో సెక్స్ వర్కర్ ను తీసుకువచ్చి వారు అనుకున్నవిధంగా బలిచ్చారు. మొదటగా ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత మాంత్రికుడి ఎదుట ఆమెను బలిచ్చారు. మొదటి సెక్స్ వర్కర్ మృతి విషయంలో వేట కొనసాగిస్తున్న పోలీసులు నీరజ్ ను అరెస్ట్ చేసి తమదైన స్టైల్ లో విచారిస్తే ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. భూతవైద్యుడు, ఇద్దరు దంపతులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.


Next Story