పురోహితుడి ఇంట్లో ముహూర్తం.. తిరుగు ప్రయాణంలో మరణం

by  |
పురోహితుడి ఇంట్లో ముహూర్తం.. తిరుగు ప్రయాణంలో మరణం
X

దిశ, పెద్దపల్లి: రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై ఎదురుగా వస్తున్న కారు.. రోడ్డు మీద యూటర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులు బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన కొండయ్య, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన రాములుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గర్రెపల్లిలోని పురోహితునికి ఇంటికి వెళ్లి ఓ శుభకార్యానికి ముహూర్తాన్ని పెట్టుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో బొంతకుంటపల్లి స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కొండయ్య మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాములు కూడా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed