- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పెద్దపల్లి: రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై ఎదురుగా వస్తున్న కారు.. రోడ్డు మీద యూటర్న్ తీసుకుంటున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతులు బొంతకుంటపల్లి గ్రామానికి చెందిన కొండయ్య, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన రాములుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గర్రెపల్లిలోని పురోహితునికి ఇంటికి వెళ్లి ఓ శుభకార్యానికి ముహూర్తాన్ని పెట్టుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో బొంతకుంటపల్లి స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా వస్తున్న కారు బైక్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే కొండయ్య మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాములు కూడా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో బాధిత కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.