బ్రేకింగ్.. మిలటరీ స్టేషన్‌పై మరోసారి డ్రోన్లతో బాంబు దాడి

by  |
Jammu-drone-Attaack
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూలో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. సోమవారం మరోసారి రెండు డ్రోన్లతో బాంబు దాడికి ప్రయత్నించారు. కలుచక్ మిలటరీ స్టేషన్ దగ్గర ఉగ్రవాదులు డ్రోన్లతో దాడికి పాల్పడగా.. భద్రతా దళాలు అప్రమత్తమై రెండు డ్రోన్లపై కాల్పులు జరిపి నిర్వీర్యం చేశాయి. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది.

అయితే, శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జమ్మూలోని భారత వైమానిక దళ(ఐఏఎఫ్‌) స్థావరంపై డ్రోన్ల సాయంతో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఇద్దరు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారు.



Next Story

Most Viewed