గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

by  |
Road-Accident1
X

దిశ, ఆమనగల్లు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన ఘటన ఆమనగల్లు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని అయ్య సాగర్ గేటు సమీపంలో శనివారం రాత్రి శ్రీశైలం- హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ- బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు కర్కాల పహాడ్ గ్రామానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed