తీవ్ర విషాదం: పెళ్లై రెండు రోజులు కూడా కాలేదు అంతలోనే నవవధువు..

by  |
తీవ్ర విషాదం: పెళ్లై రెండు రోజులు కూడా కాలేదు అంతలోనే నవవధువు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగు పెట్టాలనుకుంది.. భర్తతో సంతోషంగా గడపాలని ఆశపడింది. కానీ, ఆమె ఆశలన్నీ వరద నీటిలో కొట్టుకుపోయాయి. కాళ్లపారాణి ఆరకముందే ఆమె మృత్యువాత పడింది. ఈ విషాద ఘటనతో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మైలారం బాల్‌రెడ్డి కుమారుడు నవాజ్‌రెడ్డికి మోమిన్‌పేట మండల కేంద్రానికి చెందిన ప్రవళ్లికతో శుక్రవారం వివాహం జరిగింది. ఇక వధూవరులతో పాటు బంధువులందరు మోమిన్‌పేట విందుకు ఆదివారం కారులో బయల్దేరారు. విందు ముగించుకొని తిరిగి వస్తుండగా తిమ్మాపూర్‌ సమీపంలోని వాగు భారీ వర్షాలకు పొంగింది. ఇదేమి పట్టించుకోకుండా డ్రైవర్ కారును ముందుకు పోనివ్వడంతో ఒక్కసారిగా వాగు ఉదృతి పెరగడంతో కారు వరదలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో నవవధువు ప్రవళ్లిక తో పాటు కారులో ఉన్న పెళ్లికూతురు సోదరి, వరుడి అక్క, చెల్లి, ఎనిమిదేళ్ల బాలుడు ఇషాంత్‌రెడ్డి గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్కూ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టగా.. సోమవారం వధువు ప్రవళ్లికతో పాటు మరొకరి మృతదేహం లభ్యం అయ్యిందని, వరుడు నవాజ్‌రెడ్డి, ఆయన సోదరి శ్వేత క్షేమంగా ప్రాణాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాళ్ల పారాణి ఆరకముందే నవవధువు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Next Story

Most Viewed