జగిత్యాల జిల్లాలో ఇద్దరికి కరోనా

by Sridhar Babu |   (  Updated:2020-04-04 07:23:32  IST  )

<p>దిశ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. శనివారం జగిత్యాల జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా కలెక్టర్ రవి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 73 మందిని క్వారంటైన్‌కు తరలించి, వారందరి రక్త నమూనాలను టెస్ట్‌లకు పంపించినట్టు వివరించారు. ఇందులో 43 మందికి నెగిటివ్ రాగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందన్నారు. మిగిలిన వారి రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందన్నారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు [&hellip;]</p>

జగిత్యాల జిల్లాలో ఇద్దరికి కరోనా
X

దిశ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. శనివారం జగిత్యాల జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా కలెక్టర్ రవి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 73 మందిని క్వారంటైన్‌కు తరలించి, వారందరి రక్త నమూనాలను టెస్ట్‌లకు పంపించినట్టు వివరించారు. ఇందులో 43 మందికి నెగిటివ్ రాగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందన్నారు. మిగిలిన వారి రిపోర్టులు ఇంకా అందాల్సి ఉందన్నారు. పాజిటివ్ వచ్చిన ఇద్దరిని చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు కలెక్టర్ రవి వెల్లడించారు.

Tags: corona, lockdown, jagityal 2 positive cases, collector ravi

Next Story