నిజామాబాద్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్

by  |
covid
X

దిశ, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నిర్దారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు గురువారం ప్రకటించారు. ఇందల్వాయి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు మహారాష్ట్ర నుంచి తిరిగి రాగా, అతన్ని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.అదే విధంగా జామాబాద్ నగరానికి చెందిన వ్యక్తి మస్కట్ నుంచి జిల్లాకు వచ్చాడు.అతన్ని జిల్లా ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అనంతరం చేసిన పరీక్షలో పాజిటివ్ అని తేలగా, కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు.అతని కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించారు.కాగా, జిల్లాలో నెల రోజుల తర్వాత పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.


Next Story

Most Viewed