గాంధీ కళ్లజోడుకు అంత వాల్యూనా!

by  |
గాంధీ కళ్లజోడుకు అంత వాల్యూనా!
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత జాతిపిత మహత్మాగాంధీకి చెందిన ఓ కళ్లజోడు రికార్డు ధరకు అమ్ముడు పోయింది. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ గాంధీ కళ్ల జోడును వేలం వేయగా, ఎవరూ ఊహించని విధంగా రూ.2.5 కోట్ల ధర పలికింది.

ఈ సంస్థకు చెందిన లెటర్ బాక్సుకు వేలాడుతూ గాంధీ కళ్లజోడు కనిపించగా, వేలంలో కనీసం 15వేల యూరోలు(రూ.15లక్షలు) పలుకుతుందని నిర్వాహకులు భావించారు. కానీ, అనూహ్యంగా ఇది 2.6లక్షల యూరోలు ( సుమారు రూ.2.5కోట్లు ) పలికింది. గతంలో సౌతాఫ్రికాలో పనిచేసిన ఓ వ్యక్తి వీటిని సేకరించాడని తెలుస్తోంది. వంశ పారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి బ్రిస్టోల్ ఆక్షన్స్‌కు పంపించగా, అది పెద్దమొత్తంలో డబ్బు తెచ్చిపెట్టడంతో అతను ఆశ్చర్యానికి లోనయినట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed