ఎంసెట్‌కు 2.15 లక్షల అప్లికేషన్లు

by  |
ఎంసెట్‌కు 2.15 లక్షల అప్లికేషన్లు
X

దిశ, న్యూస్‌బ్యూరో: టీఎస్ ఎంసెట్ -2020 కోసం ఈ నెల 4 వరకు 2,15,499 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నట్టు ఎంసెట్ కన్వీనర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,39,038 మంది, అగ్రికల్చర్, మెడికల్ విభాగాల్లో కలిపి 76,461 మంది ఎంసెట్ దరఖాస్తులు సమర్పించారన్నారు. ఈ నెల పదో తేదీ వరకూ ఎలాంటి ఆలస్యపు రుసుం లేకుండా ఎంసెట్‌కు దరఖాస్తులు చేసుకోవచ్చని, వచ్చేనెల 6 నుంచి 9 వరకూ ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed