నాంపల్లిలో తొలి కరోనా కేసు

by  |
నాంపల్లిలో తొలి కరోనా కేసు
X

దిశ, మునుగోడు: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో మండల ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో టైపిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి వెల్లడించారు. దీంతో మండల కేంద్రంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్న ఆ వ్యక్తి ప్రైవేట్ ల్యాబ్ లో పరీక్ష చేయించుకున్నాడు. అనంతరం వచ్చిన రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలడంతో మంగళవారం ఉదయం అతన్ని చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed