1948-సత్యమేవ జయతే షూటింగ్ పూర్తయినట్టే…

by  |
1948-సత్యమేవ జయతే షూటింగ్ పూర్తయినట్టే…
X

దిశ, వెబ్ డెస్క్: ఎం.వై.ఎం. క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో, ఎం.వై.మహర్షి నిర్మాణంలో ‘1948-సత్యమేవ జయతే’ సినిమా చిత్రీకరిస్తున్నారు. అన్ని భారతీయ, ముఖ్య అంతర్జాతీయ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయిందని సినిమా యూనిట్ తెలిపింది. అలేఖ్య శెట్టి, రఘునందన్, (గాంధీ), ఆర్యవర్ధన్ రాజు(గాడ్సే), జెన్నీ, సమ్మెట గాంధీ, ఇంతియాజ్, శరద్ దద్భావల, పి.శ్రీనివాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

నిర్మాత ఎం.వై.మహర్షి మాట్లాడుతూ… మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి, హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని అన్నారు. వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని చెప్పారు.

11,372 పేజీల రీసెర్చ్ పేపర్స్, 350కి పైగా పుస్తకాలు, 750కి పైచిలుకు ఇంటర్వ్యూలు పరిశోధించి… 96 క్యారెక్టర్లు, 114 సీన్స్, 500కి పైగా ప్రాపర్టీస్, 370కి పైగా కాస్ట్యూమ్స్, 500కి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 47 లొకేషన్స్ లో… 9 షెడ్యూల్స్ లో, ఉన్నత ప్రమాణాలతో… జాతీయ, అంతర్జాతీయ భాషల్లో సినిమాను పూర్తి చేశామని డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్ తెలిపారు.

ఈ చిత్రానికి నిర్మాత: ఎం.వై.ఎం.మహర్షి దర్శకత్వం: ఈశ్వర్ బాబు.డి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ మేకప్: హరిప్రొడక్షన్ కంట్రోలర్ : సుదర్శన్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూర్యప్రకాష్ రెడ్డికెమెరా: చంద్రశేఖర్ (చెన్నై) కథ- స్క్రీన్ ప్లే- మాటలు: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజుసంగీతం: ‘గులాబీ’ ఫేమ్ శశిప్రీతమ్.

Next Story

Most Viewed