తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు

by  |
తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్.. భారీగా పెరిగిన కేసులు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా మరో 1,914 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది. ఇదే సమయంలో కరోనాతో మరో ఐదుగురు మృతి చెందారు.

ఇప్పటి వరకు తెలంగాణలో 3,16,649 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,734 మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో 11,617 యాక్టివ్ కేసులు ఉన్నాయి. బులిటెన్ ప్రకారం.. హైదరాబాద్‌లో గరిష్టంగా 393 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మేడ్చల్ 205, నిజామాబాద్ 179, రంగారెడ్డి 169, నిర్మల్ 104, కరీంనగర్ 80, సంగారెడ్డి 76, జగిత్యాల 68, కామారెడ్డి 64, వరంగల్ అర్బన్ 60 గా కేసుల సంఖ్య ఉంది.



Next Story