ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే ?

by  |
AP corona Update
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో వ్యవధిలో 65,920 శాంపిల్స్‌ని పరీక్షించగా 1,747 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 19,50,339కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 14 మంది మరణించగా..ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,223కు పెరిగింది. అదే సమయంలో 2,365 మంది కరోనా నుంచి కోలుకోగా మెుత్తం రికవరీల సంఖ్య 19,14,177కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,939 యాక్టివ్ కేసులున్నాయి. ఇక మరణాల విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,39,75,283 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఏపీ వైద్యఆరోగ్య శాఖ స్పష్టటం చేసింది.



Next Story

Most Viewed