ఏపీలో కొత్తగా 1,728 కరోనా కేసులు

by  |
ఏపీలో కొత్తగా 1,728 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 77,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,728 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,49,705కి చేరింది. 9మంది చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,837గా ఉంది. ప్రస్తుతం 20,857యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,22,011మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 1,777 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 89,40,488 కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 206, తూర్పుగోదావరిలో 290, గుంటూరులో 212, కడపలో 85, కృష్ణా జిల్లాలో 223, కర్నూలులో 36, నెల్లూరులో 91, ప్రకాశంలో 88, శ్రీకాకుళంలో 43, విశాఖపట్నంలో 74, విజయనగరంలో 42, పశ్చిమగోదావరిలో 239 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed