సూర్యాపేటలో మరణ మృదంగం.. కరోనాతో 17 మంది

by  |
Corona deaths
X

దిశ సూర్యాపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా బారినపడి మృతిచెందుతున్న బాధితుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. తాజాగా.. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ఆరుగురు కరోనా పేషెంట్లుమృతి చెందారు. శుక్రవారం పదకొండు మంది చనిపోగా, కేవలం రెండ్రోజుల్లోనే పదిహేడు మంది మృతిచెందడంతో కరోనా పేషెంట్లు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ వృద్ధులకు బీపీ షుగర్ ఉండటంతో చనిపోతున్నట్లు సమాచారం.

Next Story

Most Viewed