ఖమ్మంలో తాజాగా 17 పాజిటివ్ కేసులు

by  |
ఖమ్మంలో తాజాగా 17 పాజిటివ్ కేసులు
X

దిశ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతూ జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం సాయంత్రం వెల్లడైన ఫలితాల్లో 33 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో పేర్కొంది. దీంతో వారు ఎవరెవరితో ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్నారో అని అధికారులు ఆరా తీస్తున్నారు.



Next Story

Most Viewed