- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
లూధియానా: పంజాబ్లోని లూధియానాలో 167 మంది కరోనావైరస్ అనుమానితులు కనిపించడం లేదు. వారి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతికినా.. ఫలితం లేకపోయింది. విదేశాల నుంచి భారత్కు తిరిగి వచ్చినవారి వివరాలు పంజాబ్ మెడికల్ సిబ్బందికి అందగానే.. వారి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. పోలీసులు, హెల్త్ డిపార్ట్మెంట్లు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 196 మంది కోసం సెర్చ్ చేయగా.. అందులో 29 మందిని మాత్రమే ట్రేస్ చేయగలిగారు. మిగతా 167 మంది ఆచూకీ కనుక్కోలేకపోయారు. పాస్పోర్టులో చిరునామా, లేదా టెలిఫోన్ నెంబర్లు తప్పుగా ఉండడమో లేదా మార్చుకోవడమే జరిగి ఉండవచ్చునని, ఈ కారణాలతోనే 167 మంది ఆచూకీని కనుక్కోలేకపోయామని లూధియానా సివిల్ సర్జన్ డాక్టర్ రాజేష్ బగ్గా తెలిపారు.
tags : coronavirus, suspected, missing, punjab
Next Story