167 మంది కరోనా అనుమానితులు మిస్సింగ్

by  |
167 మంది కరోనా అనుమానితులు మిస్సింగ్
X

లూధియానా: పంజాబ్‌లోని లూధియానాలో 167 మంది కరోనావైరస్ అనుమానితులు కనిపించడం లేదు. వారి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వెతికినా.. ఫలితం లేకపోయింది. విదేశాల నుంచి భారత్‌కు తిరిగి వచ్చినవారి వివరాలు పంజాబ్ మెడికల్ సిబ్బందికి అందగానే.. వారి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. పోలీసులు, హెల్త్ డిపార్ట్‌మెంట్‌లు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 196 మంది కోసం సెర్చ్ చేయగా.. అందులో 29 మందిని మాత్రమే ట్రేస్ చేయగలిగారు. మిగతా 167 మంది ఆచూకీ కనుక్కోలేకపోయారు. పాస్‌పోర్టులో చిరునామా, లేదా టెలిఫోన్ నెంబర్లు తప్పుగా ఉండడమో లేదా మార్చుకోవడమే జరిగి ఉండవచ్చునని, ఈ కారణాలతోనే 167 మంది ఆచూకీని కనుక్కోలేకపోయామని లూధియానా సివిల్ సర్జన్ డాక్టర్ రాజేష్ బగ్గా తెలిపారు.

tags : coronavirus, suspected, missing, punjab

Next Story

Most Viewed