తెలంగాణలో 40 వేలకు చేరువలో కరోనా

by  |
తెలంగాణలో 40 వేలకు చేరువలో కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తున్నాయి. రోజూ 1500లకు పైగా కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేగాకుండా మొదటి నుంచి హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్న కరోనా వ్యాప్తి, ప్రస్తుతం జిల్లాలకు తీవ్ర స్థాయిలో వ్యాపించడంతో గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1597 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 796 కేసులు నమోదు కావడం గమనార్హం. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 39,342 కేసులకు చేరింది. ఇప్పటివరకూ వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 25,999 కాగా, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 12,958 చేరింది. కాగా ఈరోజు కరోనాతో 11 మంది మృతిచెందగా, ఇప్పటివరకూ మృతిచెందిన వారి సంఖ్య మొత్తం 386కు చేరిందని బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.



Next Story